
* అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా
* మధ్యాహ్నం 12.01గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న యాక్సియం-4
*శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు
* ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం
ఆకేరు న్యూస్ డెస్క్ ః భారత అంతరిక్ష రంగంలో మరో మైలు రాయి చోటుచేసుకోనుంది. భారత వ్యోమోగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో వ్యోమాగామిగా శుభాంశు శుక్లా చరిత్రలో నిలిచిపోనున్నారు. 1984 లో మొట్ట మొదటగా రాకేష్ శర్మ అంతరిక్ష యానం చేసి చరిత్ర సృష్టించాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు ఈ ప్రయోగం జరుగనుంది. ప్రయోగానికి కావాల్సిన అనుకూల వాతావరణం ఉందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. లిఫ్ట్-ఆఫ్కు వాతావరణం అనుకూలంగా ఉందని స్పేస్ ఎక్స్ తెలిపింది.మిషన్ వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయన్నారు. ఈ వ్యోమో నౌక గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఐఎస్ ఎస్ తో అనుసంధానమవుతుంది. ఇదిలా ఉండగా ఇది తన జీవితంలో అద్భుత ఘట్టంగా మిగులుతుందని వ్యోమాగామి శుభాంశు శుక్లా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా నలుగురు సభ్యులు 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఆ జాబితాలో ఏడింటిని భారత శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అలాగే ఈ యాత్రలో భాగంగా అంతరిక్షం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో శుభాంశు శుక్లా ముచ్చటించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఏడుగురు సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మాములుగా ఈ యాక్సియం మిషన్ 4.. అంతరిక్ష యాత్ర తొలుత మే 29వ తేదీన జరగాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల పలుమార్లు ఈ యాత్ర వాయిదా పడుతూ వస్తోంది. చివరకు జూన్ 25వ తేదీన ఈ యాత్రను ఖరారు చేశారు.
……………………………………………………….