
ఆకేరున్యూస్, ఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల అనారోగ్యానికి గురై ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని చెప్పారు. దీంతో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని సీపీఎం పార్టీ బాధ్యులు తెలిపారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
—————————