
* రెండు నెలల క్రితం హత్యకు గురయిన తల్లిదండ్రులు
* రూ.8 లక్షలు అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్: రెండు నెలల క్రితం పదహారు చింతల తండలో భానోతు మదన్, దీపికలకు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆర్థిక చేయూతనందించారు. ఆ చిన్నారుల తల్లితండ్రులను అతి కిరాతకంగా చంపబడిన క్రమంలో అనాథలైన పిల్లలకు నర్సంపేట నెమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చొరవతో సీఎంఆర్ఎఫ్ నుండి ఎనిమిది లక్షల రూపాయల చెక్కును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి ఉన్నత చదువులకు, భవిష్యత్తుకు, రక్షణకు అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. పిల్లలు వారి కుటుంబసభ్యులు ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్కు, నర్సంపేట ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియచేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
…………………………………..