
* సన్నాహక సమావేశానికి పిలుపునిచ్చిన ఈసీ
ఆకేరున్యూస్,న్యూఢిల్లీ: 2025 ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎన్నికలపై సన్నాహక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ వారంలోనే ఎన్నికల నిర్వహణపై అధికారులతో భేటీ కానున్నట్లు సమాచారం.. సమావేశం అయిన వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా.. ఈ ఎన్నికల కోసం అధికార ఆప్ తన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది.
……………………………………..