ప్రజావాణిలో ఫిర్యాదు..
వెనువెంటనే పరిష్కారం
ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ..
ప్రజల మన్ననలు పొందుతూ..
కమిషనర్ రంగనాథ్ తనదైన ముద్ర
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆరోపణలు ఎన్ని ఎదురైనా.. అంతే వేగంతో హైడ్రా దూకూడు పెంచుతోంది. కోట్లు విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడుతోంది. ప్రజల నుంచి మెప్పు పొందుతోంది. సంచనాలకు మారు పేరుగా చెప్పుకునే ఐఏఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపట్టి.. అదే దూకుడుగా వ్యవహారిస్తూ.. కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులను కాపాడుతున్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చిన తక్షణం రంగంలోకి దిగుతోంది. పరిశీలనలో అక్రమమని తేలితే.. వెంటనే చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ మియాపూర్లోని ఐదంతస్తుల భవనం నేలకొరిగింది. మియాపూర్లోని సర్వే నంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగాయని గుర్తించించిన ఈ ఉదయం హైడ్రా ఐదంతస్తుల అపార్ట్ మెంట్ కూల్చేసింది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులను మోహరించి కూల్చివేత ప్రారంభించింది. దీంతో విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది.
సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హైడ్రా నమోదు చేసిన కేసు వివరాలు.. (ఉన్నది ఉన్నట్లు)
* మియాపూర్లో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు.
* ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనం కూల్చివేత.
* అమీన్పూర్ లో అనుమతులు.. మియాపూర్ ప్రభుత్వ భూమి(HMDA కు చెందిన)లో అక్రమ కట్టడాలు.
* అమీన్పూర్ లోని సర్వే నంబర్ 337, 338 సర్వే నంబర్ల పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నంబర్ లోని
ప్రభుత్వ భూమిలోకి చొరబడి అక్రమ కట్టడాలు.
* అమీన్పూర్ సర్వే నంబర్ 337, 338 లలో హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400ల గజాల 126 నెంబర్
ప్లాట్ కొని.. ఆ పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి చొరబడి 126/D , 126/ part, 126/C
గా ప్లాట్లు సృష్టించిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు.
* మియాపూర్లోని HMDA భూమిలోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు
ఎల్లారెడ్డి అండ్ అదర్స్ మొత్తం దాదాపు 873 గజాల మేర 5 అంతస్తుల భవనం నిర్మాణం.
* ఫేక్ LRS సృష్టించిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు.
* LRS కోసం డబ్బులు చెల్లించినట్టు పేర్కొన్న DD కూడా ఫేక్.
* ఇప్పటికే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన అధికారులు.
* మియాపూర్ ప్రభుత్వ స్థలంలోకి జరిగి నిర్మించిన 473 గజాల మేర ఉన్న భాగాన్ని తొలగించిన హైడ్రా.
* ప్రభుత్వ భూమిలోకి వచ్చి చేపట్టిన నిర్మాణం మేరకు హైడ్రా చర్యలు.
* ప్రభుత్వ భూమి లోకి జరిగి 5 అంతస్తుల నిర్మించడంపై హైడ్రాకు ఫిర్యాదు చేసిన HMDA అధికారులు.
* స్థానిక రెవెన్యూ, HMDA, మున్సిపాలిటీ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలోంచి హైడ్రా.
* ప్రభుత్వ భూమిలోకి జరిగి అక్రమంగా భవనం నిర్మిస్తున్నట్టు నిర్ధారించుకున్న హైడ్రా.
* 2014లో LRS ఫేక్ పత్రాల సృష్టించినట్టు నిర్ధారణ.
* అన్నీ పరిశీలించిన అనంతరం శనివారం మియాపూర్ పరిధిలోకి వచ్చిన భవనం మేరకు
ఆక్రమణలు తొలగింపు.
పాలనలో.. విమర్శలు ఎన్ని ఎదురైనా.. హైడ్రా అంటే భయం కాదు..భవిష్యత్ తరాలకు భరోసా అని చాటిచెప్పుతున్నారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ..పేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పాలనలో తనదైన ముద్ర వేస్తూ.. ప్రజల మన్ననలు పొందుతున్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.
………………………………………………………..
