
* త్వరగా మూడిరటి అభివృద్దికి చర్యలు
* కేంద్రమంత్రి రామ్మోహన్తో సీఎం రేవంత్ రెడ్డి చర్యలు
* త్వరగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సిఎం రేవంత్ రెడ్డి (REVANTHREDDY) అన్నారు. ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్టు ( WARANGAL AIRPORT ) పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. భూ సేకరణ ఎంత తొందరగా పూర్తయితే.. అంత త్వరగా ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణాలు చేపట్టాలని సీఎం ప్రతిపాదించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (REVANTHREDDY) కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలోనే వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. వరంగల్తో పాటు మరో మూడు.. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తమను కోరారన్నారు.
కాగా, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందన్నారు. అందుకు సంబంధించిన నివేదిక సానుకూలంగా వస్తే.. అనంతరం భూసేకరణకు వెళ్లొచ్చన్నారు. ఇక ఆదిలాబాద్ విమానాశ్రయం మాత్రం రక్షణ శాఖ పరిధిలో ఉందన్నారు. ఆ శాఖ నుంచి అనుమతి వస్తే.. ఆదిలాబాద్లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఆదిలాబాద్కు ఓ వైపు చత్తీస్గఢ్, మరోవైపు మహారాష్ట్రలు సరిహద్దులు ఉన్నాయన్నారు. దీంతో ఆ దరిదాపుల్లో విమానాశ్రయం లేదని గుర్తు చేశారు. అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. మరోవైపు వరంగల్ విమానాశ్రయం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రో యాక్టివ్గా వ్యవహరిస్తూ.. భూసేకరణకు ఇప్పటికే సర్క్యులర్ సైతం జారీ చేసిందని వివరించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వరంగల్లో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.
………………………………….