
ఆకేరున్యూస్, గుంటూరు: అనుమతి లేకుండా విక్రయిస్తూ పట్టుబడిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తుండగా మందుబాబులు ఎగబడి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పలు కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.50లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు ఏటూకూరు రోడ్డులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు మందుబాబులు పోలీసుల ముందే మందు బాటిళ్లను ఎత్తుకుని పరిగెత్తారు. అనంతరం పోలీసులు వారిని చెదరగొట్టి మద్యం బాటిళ్లను జేసీబీ సాయంతో ధ్వంసం చేశారు.