
* శాసనసభా పక్షాలను విలీనం చేసుకున్నప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం..
* బీఆర్ఎస్ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.
* కోర్టు తీర్పులపై గౌరవం ఉంది
* ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, వరంగల్: ఏకంగా శాసనసభా పక్షాలను విలీనం చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని బీఆర్ఎస్ నేతలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు.. స్టేషన్ ఘన్పూర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానాల మీద గౌరవం ఉందని, ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చే అవకాశమే లేదన్నారు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఇప్పుడు ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకంతో బ్రహ్మాండమైన మెజారిటీ అందించారన్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి, పరిపాలన సజావుగా ఉంటుందనే ఎవరెన్ని విమర్శలు చేసినా, పరోక్షంగా ఓడిరచాలని చూసినా ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించారని.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నెల 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయగా.. సీఎం సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి రావాలంటే 100పడకల అస్పత్రి నిర్మించాలని దానికి నిధులు, ఆర్టీసీ ల్యాండ్ అలాట్ మెంట్ చేయాలని కోరగానే సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటులో ఘనపూర్ నియోజకవర్గానికి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారని వెల్లడిరచారు. మేజర్ గ్రామ పంచాయతీ అయినా ఘనపూర్ను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిపారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని కోరగా.. వెంటనే సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. నీటి పారుదల శాఖకు సంబంధించి తెలిపిన పనులన్నింటిని వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వెల్లడిరచారు. అలాగే నియోజకవర్గంలో 100కోట్లు ఆర్అండ్బి రోడ్లకు, మరో 100కోట్లు పంచాయతీ రాజ్ రోడ్లకు కేటాయించాలని కోరినట్లు వివరించారు. వీటన్నింటికి త్వరలోనే ప్రభుత్వ ఉత్తర్వులు రానున్నాయని, నవంబర్ నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేస్తామని వెల్లడిరచారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని తెలిపారు. నా 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి చాలా చూశానన్నారు. స్థాయిలేని మనుషుల గురించి నేను మాట్లాడానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………………………………