
* పాఠశాలల్లో సబ్జెక్టుకి 20 చొప్పున ఇంటర్నల్స్ మార్కులు రద్దు
* గతంలో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షల నిర్వహణ
* కొత్త విద్యా విధానంలో 100 మార్కులకు పరీక్షలు నిర్వహణ వాటి ఆధారంగానే గ్రేడిరగ్
ఆకేరు న్యూస్, కమలాపూర్: పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుకు 20 మార్కులు చొప్పున ఇంటర్నల్ మార్కులను ఇచ్చే గత విద్యా విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. సీసీఈ విద్యా విధానంలో పదవ తరగతి విద్యార్థులకు జీపీఏ ఆధారంగా గ్రేడిరగ్ ఇస్తారు.ఈ విధానంలో పదో తరగతిలో వంద మార్కులకు గాను 20 ఇంటర్నల్ మార్కులను పాఠశాలలో విద్యార్థులకు కేటాయించి మిగిలిన 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించేవారు. పబ్లిక్ పరీక్షలో వచ్చిన మార్కులకు, ఇంటర్నల్గా పాఠశాలలో విద్యార్థులు రాసిన ఎఫ్ఏ పరీక్షలు, ప్రాజెక్టు, ఫేర్ నోట్స్, రిఫ్లెక్షన్ వంటి రాత కు సంబంధించిన వాటికి 20 మార్కులు కలిపి 80ం20 తో 100 మార్కులకు గాను పూర్తిస్థాయి ఫలితాలు ఇచ్చేవారు. కానీ ఇంటర్నల్ మార్కుల విషయంలో వచ్చిన ఫిర్యాదుల వల్ల ప్రభుత్వం పాఠశాలల్లో నిర్వహించే ఇంటర్నల్ మార్కులను రద్దు చేసింది. ఈ విద్యా సంవత్సరం 2024-2025 నుంచి ఇంటర్నల్ మార్కులను తొలగించి వంద మార్కులకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనుంది.
……………………………………