
– పాలకుర్తిలో రేవంత్ కు పాలభిషేకం
– కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
ఆకేరు న్యూస్, జనగామ: రైతులకు రైతు భరోసా ఇచ్చి రైతు బాందవుడిగా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచాడని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. మంగళవారం పాలకుర్తి లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. ఈ సందర్భంగా సీఎం అనుకూల నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో దగా చేసిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పెంచి రైతులకు పంపిణీ చేయడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరగాని కుమారస్వామి, కుందూరు గోపాలరెడ్డి, ఇట్టే శ్యామ్ సుందర్ రెడ్డి, మొలుగూరు మొలుగురు యాదయ్య, బొమ్మగాని భాస్కర్, జొన్న సోమిరెడ్డి, బొమ్మగాని కొమురయ్య, నీరటి చంద్రయ్య, తదితరు నాయకులు పాల్గొన్నారు.
…………………………………………