
* గోదావరిలో స్నానానికి దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు
* అమ్మవారి దర్శనానికి వచ్చిన కుటుంబం
ఆకేరు న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర(BASARA)లో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ గోదావరిలో స్నానానికి దిగిన అయిదుగురు గల్లంతయ్యారు. వారిలో నలుగురు మృతదేహాలను వెలికి తీశారు. మరొకరి కోెసం గోదావరి నదిలో ఈతగాళ్లు గాలిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ (HYDERABAD)వాసులుగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. రాకేష్ (17), వినోద్ (18), మదన్ (18), రుతిక్, భరత్ చనిపోయినట్లుగా నిర్దారించారు. బాసర అమ్మవారి దర్శనానికి వచ్చి మృతి చెందడం తీవ్రమైన విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………..