
ఏసోబు మృతదేహానికి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
– కుటుంబ సభ్యులకు పలువురు ప్రజాప్రతినిధుల పరామర్శ
ఆకేరున్యూస్, వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 64 వ డివిజన్ పరిధి టేకులగూడేనికి చెందిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మాచర్ల ఏసోబు అలియాస్ జగనన్న మహారాష్ట్ర- ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో మృతిచెందారు. గురువారం స్వగ్రామం టేకులగూడెంలో ఏసోబు పార్థివదేహానికి బీజేపీ నాయకులు, వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్పూ లమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక 64 వ కార్పొరేటర్ రాధికా రెడ్డి, కాజీపేట దర్గా PACS చైర్మన్ ఊకంటి వనం రెడ్డి, మల్లారెడ్డిపల్లి PACS చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, పోలేపల్లి రామ్మూర్తి, శేఖర్, దయాకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
