
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో గేమ్ ఛేంజర్ టికెట్ల ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో టికెట్ల ధరలతో పాటు అదనపు షోలకు ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇకపై తెల్లవారు జామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, ఆరోగ్య భద్రత దృష్ట్యా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంది.
…………………………………….