
ఆకేరున్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళను ముగ్గురు యువకులు గ్యాంగ్రేప్ చేశారు. తప్పిపోయిన వేరే మహిళ కోసం సీసీ టీవీ ఫుటేజిని వెతుకుతుండగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మాసాయిపేట మండలం రామాంతపూర్లో ఓ మహిళ అదృశ్యం కాగా.. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు. కాగా..అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తుండగా పోలీసులు షాకింగ్ విషయాన్ని గుర్తించారు. మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురైన బాధిత మహిళను వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా.. ఆమె ఏ వివరాలు చెప్పలేకపోయింది. దీంతో బాధితురాలిని భరోసా సెంటర్కు తరలించారు.
………………………………