
* చిన్నారులతో దీపావళి వేడుకలు జరుపుకున్న ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరున్యూస్, హన్మకొండ: దీపావళి సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మానసిక దివ్యాంగ చిన్నారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని హనుమకొండ మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చెందిన మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గురువారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని వారి నివాసంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు స్వయంగా స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
………………………………….