
* ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు
* రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మూసీ ప్రక్షాళన పేరుతో ఇంకా ఎంత మందిని చంపుతావని సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy)పై మాజీ మంత్రి హరీశ్రావు(Harishrao) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. మూసీలో నీళ్లు పారించాలి అనుకుంటున్నావా..? పేదోళ్ల కన్నీళ్లు, రక్తం పారించాలి అనుకుంటున్నావా..? అని రేవంత్పై హరీశ్రావు మండిపడ్డారు. హైడ్రా వేధింపులు భరించలేక.. ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. మూసీ సుందరీకరణ(Musi Dovelopment) పేరుతో ఎంత మందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల్లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రేవంత్ సర్కారు ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేసిందన్నారు.
……………………….