
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్ ,హైదరాబాద్ : బీఆర్ ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే సింగరేణి సంస్థకు న్యాయం జరిగిందని సింగరేణి ఏరియాల్లోని 13 నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ ఓటమి ఆశ్చర్యానికి గురిచేసిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఊకంటి ప్రభాకర్ రావుతో పాటు 300 మంది కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో చేరారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు మంచిర్యాల, గోదావరి పరివాహక ప్రాంతంలోని రామగుండం, మంథని, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, సత్తుపల్లి, కొత్తగూడెంలో ఒక్క సీట్లో కూడా గెలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన 10 హామీల్లో 8 హామీలు పూర్తి చేశాం. తర్వాత వచ్చిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం జరిగిందని అన్నారు. దీని గురించి పార్టీలో విశ్లేషించుకుంటున్నామని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతోందని ఈ 22 నెలల్లో ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని కేటీఆర్ అన్నారు. పీఏసీఎస్ కేంద్రాల వద్ద రైతులు చెప్పులు పెట్టి యూరియా కోసం నిరీక్షిస్తున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ తీరు అగమ్య గోచరంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
………………………………………………………