
* సంవిధాన్ హత్యా దివస్ గా ఎమర్జెన్సీ రోజులు
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఆకేరు న్యూస్, డెస్క్ : ఎమర్జెన్సీ రోజుల్లో తాను అనుభవించిన విధానాన్ని, ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా చేసిన ప్రయాణాన్ని వివరిస్తూ ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ (THE EMERGENCY DAIRYS) అనే పుస్తకాన్ని త్వరలో తీసుకురాబోతున్నట్లు ప్రధాని మోదీ (MODI) వెల్లడించారు. ఈ పుస్తకం ప్రజాస్వామ్యం విలువలపై కొత్త తరం మనుగడకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 1975లో విధించిన ఎమర్జెన్సీకి ఈ రోజుతో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మోదీ సోషల్ మీడియా వేదిక ‘X’లో ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆయన సంవిధాన హత్యగా అభివర్ణించారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛలు ఆ కాలంలో నాశనమయ్యాయని మండిపడ్డారు. ఆ సమయంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు నిర్భయంగా నిలబడ్డారని, వారికి నా వందనాలు అని ప్రధాని ట్వీట్(TWEET)లో పేర్కొన్నారు. అంతేకాదు, అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజాస్వామ్యాన్ని అరెస్టు చేసిందన్నారు.
………………………………………………….