
* ఎమ్మెల్యే సంజయ్ కుమార్
ఆకేరు న్యూస్, జగిత్యాల : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి మేరకు జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులలంతా ఐక్యంగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి సమిష్టిగా ప్రయత్నం చేయాలని అన్నారు. బుధవారం జగిత్యాలలోని దేవి గార్డెన్ లో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జగిత్యాల జిల్లా తృతీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ…జర్నలిస్టుల సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మాట వాస్తవమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. జర్నలిస్టులలో ఐక్యత లోపం ఉందని, ఐఎంఏ లాగా జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
జగిత్యాలలో జర్నలిస్టులకు తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని, సమస్యలను పరిష్కరిస్తానని ఆయన అన్నారు. జడ్పీ మాజీ ఛైర్మన్ దావా వసంత సురేష్, మున్సిపల్ తాజా మాజీ ఛైర్ పర్సన్ అలవాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ…ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు అండగా ఉండాలని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అంతకు ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రారంభోపన్యాసం చేస్తూ…రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని, ఇటు యాజమాన్యాలు, అటు ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, గత ప్రభుత్వం పదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదని, తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని మామిడి సోమయ్య కోరారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నల్లాల జైపాల్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో మాజీ జెడ్పీటీసీ మహేష్, బీ ఆర్ ఎస్ నాయకురాలు అనురాధ, సింగిల్ విండో ఛైర్మన్ మహిపాల్ రెడ్డి, అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్క విజయ్ కుమార్, డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా శ్యామ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్,వల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ద్యావర సంజీవ రాజు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కుడితాడు బాపురావు తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన ఈ మహాసభలో పలువురు సీనియర్ జర్నలిస్టులను శాలువా, మెమొంటోతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఫెడరేషన్ సభ్యులకు యూనియన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అంతకు ముందు ఇటీవల మరణించిన పలువురు జర్నలిస్టులకు సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు.
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
-అధ్యక్షుడుగా సంజీవరాజు
-కార్యదర్శిగా రవీందర్ రావు
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జగిత్యాల జిల్లా తృతీయ మహాసభ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా ద్యావర సంజీవ రాజు (సూర్య స్టాఫ్ రిపోర్టర్), కార్యదర్శిగా మేన్నేని రవీందర్రావు (మనం స్టాఫ్ రిపోర్టర్), కోశాధికారిగా ఎం. శ్రీనివాసరావు (నినాదం), ఉపాధ్యక్షులుగా రాగం రమేష్ (నేటి కీసరి స్టాఫ్ రిపోర్టర్), పిప్పరి శ్రీనివాస్ (9 న్యూస్ ), ఉత్తమ్ మహేష్ (సూర్య), కాసం శ్రీనివాస్ రెడ్డి (ప్రజా క్రాంతి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆముద లింగారెడ్డి (పృధ్వీ న్యూస్), సంయుక్త కార్యదర్శిలుగా బెజ్జారపు అన్వేష్ (ఆంధ్రప్రభ మెట్పల్లి), దూడ జీవన్ (దిశ), ముత్తినేని శ్రీనివాస్ (ఆదాబ్ హైదరాబాద్), అనంతుల కాంతారావు (తెలంగాణ శక్తి), కార్యవర్గ సభ్యులుగా వేముల కృష్ణ కుమార్ (అన్వేషణ), చింత గంగాధర్ (మెట్రో ఈవినింగ్), మాకు రాజలింగం (నేటి కేసరి), చింత రోజా (చట్టం), బోర గళ్ళ లావణ్య (ప్రజా పక్షం), ముల్క రాజేశం (నేటి వార్త), మహమ్మద్ కిజర్ (ఆంధ్రప్రభ కోరుట్ల), కొప్పుల శ్రీధర్(క్రైమ్ న్యూస్), భూమి వేణుమాధవ్ (ప్రజా సాక్షి), ఎండి ఆజం (ప్రజా తెలంగాణ), గొపడి నరేంద్ర రావు (ప్రజా సాక్షి), సిరిపురం శ్రీనివాస్ (పృద్వి న్యూస్), ఎర్రం చందన్ కుమార్ (స్టార్ నైన్ న్యూస్), అట్ల నగేష్ (ప్రజా జ్యోతి), గుగ్గిల సత్యనారాయణ (మెట్రో ఈవినింగ్), ఎస్. ప్రవీణ్ కుమార్ (నేటి ఉదయం), జాతీయ కౌన్సిల్ సభ్యుడుగా నల్లాల జైపాల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బలిజ రాజారెడ్డి (కోరుట్ల), అన్నం కిషన్ రెడ్డి (జగిత్యాల), రేణికుంట శ్రీనివాస్ (జగిత్యాల) తదితరులు ఎన్నికయ్యారు.
……………………………………………………..