
* ఇంచార్జి సునీల్ బన్సాల్ ఆధ్వర్యంలో బేటీ
హైదరాబాద్, ఆకేరున్యూస్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల కీలక సమావేశం జరుగుతుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ బన్సాల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బూత్ కమిటీలు, ఇతర నూతన కార్యవర్గాల ఎంపిక, ఇతర అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రి, రాష్ట్ర, అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు , మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, నాగేష్ తోపాటు ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, వెంకట రమణా రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో ఉన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు.
…………………………………….