
* 30 డిపార్టుమెంట్లు, 2వేల పడకలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. 30 డిపార్ట్మెంట్లు, 2వేల పడకలు, ఫిజియోథెరపీ, డెంటల్, కాలేజ్లు, హాస్టల్ వసతితో ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. అడ్డంకులు దాటుకొని శంకుస్థాపనకు సిద్ధమైంది ఉస్మానియా ఆసుపత్రి. రానున్న టెక్నాలజీ కాలానికి అనుగుణంగా హెలిప్యాడ్ వసతి, ఆసుపత్రి మురుగు నీరు శుద్ధి చేసేందుకు ప్లాంట్, విశాలమైన పార్కింగ్ ఫెసిలిటీ తో కొత్త ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూ వార్డులు అందుబాటులో ఉంటాయన్నారు. కిడ్నీ, లివర్, స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం కొత్త ఉస్మానియాలో అందుబాటులోకి రానున్నాయి. పేషెంట్ల సౌకర్యార్థం అన్ని రకాల డయాగ్నసిస్ సేవలను ఒకే చోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లో ఓపీ సేవలు అందించాలని పేషెంట్ల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్స్, కనీసం రోజూ 3 వేల నుంచి 5 వేల మంది పేషెంట్లు వచ్చే అవకాశం ఉన్నందున, ఇందుకు అనుగుణంగా ఓపీ కౌంటర్ల నిర్మాణం జరగనుంది.ఓపీ కోసం గంటల తరబడి లైన్లో నిలబడే ప్రసక్తే ఉండకుండా నిర్మాణం. కొత్త ఉస్మానియాలో నర్సింగ్, డెంటల్, ఫిజియో థెరపీ కాలేజీలు అందుబాటులోకి..స్టూడెంట్ల కోసం హాస్పిటల్ ఆవరణలోనే హాస్టల్స్ నిర్మాణం. 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం అందుబాటులోకి రానుంది.
………………………………………….