
* కౌశిక్ అరెస్ట్పై గగ్గోలు .. లొల్లి ఎందుకు
* రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ ఎస్ నాయకులు
* భూ కబ్జాలకు పాల్పడ్డారు
*తెలంగాణను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్నారు
* ఆంధ్రపాలకుల కంటే వెయ్యిరెట్లు ఎక్కువ దోచుకున్నారు
* ఏం చేసినా అడిగితే పాపమట..!
* బీఆర్ ఎస్ నేతలపై ఎమ్మెల్యే నాయిని ఫైర్
ఆకేరు న్యూస్ హనుమకొండ ః పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇంత గగ్గోలు, ఇంత లొల్లి ఎందుకు పెడుతున్నారంటే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడా అంటూ నాయిని ప్రశ్నించారు. కాంగ్రెస్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడారు.పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలను అరెస్ట్ చేయకపోతే ప్రజలు క్షమించరని నాయిని అన్నారు.విచారణ చేపడితే జై తెలంగాణ అంటారు. విచారణకు జై తెలంగాణకు ఏమన్నా సంబందం ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ హయాంలో తాను ఏం చేయకున్నా తనపై తప్పుడు కేసులు బనాయించారని నాయిని గుర్తు చేశారు. బీఆర్ ఎస్ నాయకులు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని బూకబ్జాలకు పాల్పడ్డా చూస్తూ ఊరుకోవలట..ఇదెక్కడి న్యాయం.. తెలంగాణ పేరు చెప్పుకుంటూ తెలంగాణను అడ్డగోలుగా దోచుకుతింటున్నారని నాయిని అన్నారు. బీఆర్ ఎస్ ప్రజలను అసహ్యించుకుంటున్నరని నాయిని అన్నారు. వీళ్లను క్షమిస్తే దేవుడు తమను క్షమించడని నాయిని అన్నారు.ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ ప్రభాకర్ రావును కూడా విచారించవద్దని అంటున్నారని నాయిని అన్నారు.గతంలో ఉద్యమాల పేరుతో రెచ్చగొట్టి లబ్ధి పొందారని నాయిని అన్నారు. బ్లాక్ మెయిల్ చేస్తూ బతుకుతున్నారని నాయిని అన్నారు. ప్రభుత్వం తలచుకుంటే వీళ్లను జైలు పాలచేయడం ఓ లెక్కకాదని నాయిని అన్నారు. చట్టానికి నమ్మొకొని చట్టం ప్రకారం నడుచుకుంటున్నం కాబట్టే మీరు ఈ రోజు రోడ్లపై తిరుగుతున్నారని బీఆర్ ఎస్ నాయకులనుద్దేశించి నాయిని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డే కాదు రేపు ఇంకా చాలా మందికి ఇదే గతి పడుతుందని నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.
…………………………………….