
* అర్దరాత్రి అమానుషంగా అరెస్ట్ చేశారు
* ఓ ఎమ్మెల్యేను రౌడీలా అరెస్ట్ చేస్తారా..?
* రౌడీలు యధేచ్చగా రోడ్లపై తిరుగుతన్నారు
* ఇదేం ప్రభుత్వ విధానం..?
* ప్రజాస్వామ్యవాదులంతా కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను ఖండించాలి
* మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్
ఆకేరు న్యూస్, హనుమకొండఃకాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక పద్దతిలో వ్యవహరిస్తోందని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్పై ఆయన మండి పడ్డారు. ఒక వీధి రౌడీని అరెస్టు చేసినట్లు ప్రజలచే ఎన్నకోబడిన ప్రజాప్రతినిధిని అలా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని దాస్యం అన్నారు. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన కేసీఆర్ పైనే తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని వినయ్ భాస్కర్ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎక్కడో ఏదో కుంగిందని రాద్దాంతం చేస్తూ కాళేశ్వరం కమిషన్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ,కమిషన్ ముందుకు కేసీఆర్ ను పిలిపించి అవమాన పరుస్తున్నారని దాస్యం మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచంలో గుర్తింపు తేవడానికి కృషి చేసిన కేటీఆర్ ను కూడా కేసుల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ ఎస్ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని దాస్యం అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కడిగిన ముత్యంలా మళ్లీ ప్రజల ముందుకు వస్తామని దాస్యం అన్నారు.పాడి కౌశిక్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేవారని పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ బీఆర్ ఎస్ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని దాస్యం అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని న్యాయస్థానాలపై బీ ఆర్ ఎస్ కు నమ్మకం ఉందని దాస్యం వినయ భాస్కర్ అన్నారు.
………………………………………….