
* వరి ఉత్పత్తిలో నల్గొండను నంబర్ 1 చేసిన ఘనత ఆయనదే
* రైతు మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరు న్యూస్, నల్గొండ : నల్గొండ పలికిన ఘన స్వాగతం చూస్తే కేసీఆర్ (KCR) మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారా అన్నట్లుందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో కేటీఆర్ ప్రసంగించారు. రైతు మహాధర్నాకు వచ్చినట్లు లేదని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో స్వాగతం పలికినట్లుగా ఉందన్నారు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిందనే రీతిలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా ఉందన్నారు. ప్రపంచంలో ఏ శక్తీ కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కాదని, నల్గొండ (NALGONDA) పోరాటాల గడ్డ రుజువు చేసిందన్నారు. తెలంగాణలో వరి ఉత్పత్తిలో నల్గొండ జిల్లాను కేసీఆర్ నంబర్ వన్ చేశారని తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ, ఎన్ఎస్పీ కింద టెయిల్ అండ్ గ్రామాలకు నీళ్లు వచ్చేవి కావని, కృష్ణా, గోదావరిలో నీళ్లు ఒడిసి పట్టి పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం చేపట్టామన్నారు. చివరి మడి వరకు నీళ్లు ఇచ్చిన రైతు నాయకుడు కేసీఆర్ అని చెప్పారు.
………………………………………