*రాజన ఆలయాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు
*భక్తులకు కొంగుబంగారం వేములవాడ రాజన్న
ఆకేరు న్యూస్, కరీంనగర్ : సీఎం రేవంత్ రెడ్డికి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక మైన శ్రద్ధ ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కఅన్నారు.వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధికి శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో వేముల వాడ ఆలయాన్ని రాజకీయ నాయకులు దర్శించుకోవడానికి అనుమాన పడేవారని వేములవాడను దర్శించుకుంటే కలిసిరాదనే అపోహలో ఉండేవారని ఆమె అన్నారు. కేసీఆర్ హయాంలో వేములవాడ అభివృద్ధిని పట్టించుకోలేదని సీతక్క ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.కానీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తాను వేములవాడ రాజన్నను దర్శించుకున్నామని గుర్తుచేశారు. అలాగే, మేడారం సమ్మక్క – సారక్క అమ్మవార్ల నుంచి పాదయాత్ర ప్రారంభించామని తెలిపారు. వేములవాడ రాజన్నను ఎంతోమంది భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారని తెలిపారు సీతక్క.ప్రస్తుతం.. వేములవాడకు భారీగా భక్తులు తరలివచ్చి రాజన్నకు మొక్కులు సమర్పిస్తుంటారని పేర్కొన్నారు. రాజన్నపై నమ్మకంతోనే ఇంతమంది భక్తులు ఆలయానికి వస్తున్నారని వెల్లడించారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా స్వామివారిని భక్తులు కొలుస్తుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

