
* ఒకే పనికి రెండు శంకుస్థాపనలా..
* పాలకుర్తి గులాబీ నేతల ప్రశ్న
ఆకేరు న్యూస్, జనగామః పేద ప్రజలకు వైధ్యం అందించే ధావాఖాన అది. ముప్పై పడకల దావాఖానగా ఉండి ఎంతో మంది పేద, మద్యతరగతి ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నది. ఈ దావాఖాన ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంది. 30 పడకలున్న ఈ దావాఖాన 50 పడకల దావాఖానగా అప్గ్రేడ్ అవుతుంది. అంటే ఇప్పుడే అప్గ్రేడ్ అవుతుందా.. లేక ఇంతకు ముందున్న సర్కారే అప్గ్రేడ్ చేసిందా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ దావాఖాననే ఇప్పుడు అటు పాలక పార్టీ కాంగ్రేస్, ఇటు గులాబీ పార్టీల నడుమ రాజకీయ చిచ్చు రేపుతుంది. దావాఖాన 30 పడకల నుంచి 50 పడకలకు అప్గ్రేడ్ అయితే ఇక్కడ పంచాయతీ ఎందుకు అనే కదా మీ సందేహం. అవునండి ఇక్కడే ఉంది అసలు ట్వీస్ట్. అదేంటో ఓసారి లుక్కేద్దాం. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం కాకముందు చెన్నూరు గ్రామం పేరుమీద చెన్నూరు నియోజకవర్గం ఉండేది. అయితే అప్పటి ఎమ్మెల్యే, మాజీ మంత్రి స్వర్గీయ నెమరుగొమ్ముల యతిరాజారావు పాలకుర్తికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయించారు. అది కొంత కాలానికి 30 పడకలకు అప్గ్రేడ్ అయింది. ఇక్కడి దాకా ఏ పంచాయతీ లేదు. అంతా సవ్యంగానే ఉంది. అయితే గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్రావు దావాఖానాను 50 పడకలకు అప్గ్రేడ్ చేయించారు. దీనికి తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి రూ.17.50కోట్ల నిధులు మంజూరు చేయించి, 2023 అక్టోబర్ 9న ఆప్పటి రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులు మీదుగా శంకుస్థాపన చేశారు. ఇందుకు సరిపడా నిధుల విడుదల చేస్తూ మంజూరు ఉత్తర్వులు చేశారు. అయితే ఇక్కడే ఒక చిక్కు ఒచ్చి పడింది. ఇంతలోనే సాధారణ ఎన్నికల నోటిఫికేస్ విడుదల కావడం, చకచకా ఎన్నికలు జరుగడం.. పాలకుర్తిలో మంత్రి దయాకర్రావు ఓడిపోవడం, రాష్ట్రంలో గులాబీ పార్టీ ఓడిపోయి హస్తం పార్టీ గెలవడం దావాఖానా పనులు శిలాఫలకంలోనే ఆగిపోయాయి. పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పుడు ఇదే 50 పడకల దావాఖానాకు స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మంత్రి పొంగులేటీ శ్రీనివాస రెడ్డితో శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. ఈనెల 30న ఇదే దావాఖానా ప్రాంగణంలో అప్పటి శిలాఫలకం కు కొంచెం ముందు మరో శిలాఫలకం వేసేందుకు చురుకుగా పనులు చేస్తున్నారు అధికారులు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన కార్యక్రమానిక వస్తున్న క్రమంలో బీ ఆర్ ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఏమయ్యా మంత్రి గారు.. మీరు ఇంతకు ముందు వేసిన శిలాఫలకం చోటనే మరో శిలాఫలకం వేయడానికి రావడానికి నీకు మనసెలా వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు.
మంత్రి గారు.. మనసు మార్చుకోండి
పాలకుర్తి హాస్పిటల్ పై అవగాహన ఉందా లేదా.. 50 పడకల ఆసుపత్రి మంజూరు అయ్యింది… టెండర్ లేట్ అయ్యింది… ఇంతకు ముందే మంత్రి హరీష్రావు శంకుస్థాపన చేశారు.. మళ్ళీ మరోసారి శంకుస్థాపన చేయాలనుకోవడం విడ్డూరంగా ఉంది… కొంచెం మనసు మార్చుకొని కొత్త పనులకు శంకుస్థాపన చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గౌరవం ఉంటుంది అని బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి హితువు పలికారు. ఆదివారం బీ ఆర్ ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలకుర్తి నుంచి టూరిజంగా అభివృద్ధి చేయాలని దయాకర్ రావు ఎంతో కృషి చేశాడని అన్నారు. ఆగిన పనులకు మళ్ళీ శిలపాలకం వేయడం ఏమిటో జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి తెలవాలే. పోస్టుమార్టం మంజూరు అయింది.. నిర్మాణం పూర్తయింది.. ప్రారంభోత్సం కూడా చేశారు.. కాకుంటే అక్కడ సిబ్బందిని నియమించి అది ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చేయాలని హితువు పలికారు. కేవలం కొబ్బరికాయలు కొట్టడం కాదు.. కొత్త పనులు మంజూరు చేయండి అని అన్నారు. దయకర్ రావు హరిత హోటల్ మంజూరు చెపించారు. అది కట్టండి.. పర్యాటలకు అందుబాటులోకి తేండి.. సోమనాథ కళాక్షేత్రం శిధిలం అవుతుంది.. దాన్ని కాపాడే భాద్యత తీసుకోండి.. పోతన్న ఆడిటోరియం 70 శాతం పనులు పూర్తి అయ్యాయి.. మిగతా వాటిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయండి. దానికి ఇంత వరకు అతీగతీ లేదు. సమీక్ష చేశారు… నిర్మాణం మరిచారు. మెరుగైన సేవలు అందేవి.. పాత పనులను పూర్తి చేసి, కొత్త పనులు మంజూరు చేస్తే ప్రజలు హర్షిస్తారని అన్నారు. విలేకరుల సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ కారుపోతుల వేణు, మాజీ చైర్మన్ కఠారి పాపారావు, బీ ఆర్ ఎస్ నాయకులు పాము శ్రీనివాస్, మాచర్ల ఎల్లయ్య, కత్తి సైదులు, లాకావత్ వెంకట్, ఎడవెల్లి శ్రీనివాస్, మాటూరు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
…………………………………….