
ఆకేరు న్యూస్, జనగామ: గడ్డం వివేక్ వెంకట స్వామి కార్మిక, గనుల, మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ సచివాలయంలోని (ఛాంబర్ నెం. 20, 21, & 22) 2వ అంతస్తులో ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాజీ మంత్రి జె గీతా రెడ్డి, పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
……………………………………………