
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హర్యాణా, జమ్ము కశ్మీర్లో నేడు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. ఆపరేషన్ షీల్డ్ పేరుతో నిర్వహించాల్సిన ఈ మాక్ డ్రిల్స్ను కేంద్ర హోం శాఖ ఆదేశాలతో వాయిదా వేసినట్లు హర్యాణా ప్రభుత్వం వెల్లడిరచింది. పరిపాలనా కారణాల వల్ల ఈ మాక్ డ్రిల్స్ వాయిదా వేస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. అలాగే జూన్ 3న మాక్డ్రిల్స్ నిర్వహించనున్నట్లు పంజాబ్ వెల్లడిరచింది.
………………………..