
* మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా..
* ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరుకానున్న సినీ నటుడు నాగార్జున
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో సినీ నటుడు అక్కినేని నాగార్జున తన వాంగ్మూలం ఇచ్చేందుకు నేడు కోర్టుకు హాజరుకానున్నారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాగార్జున తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేయగా.. ఈ కేసులో సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, వెంకటేశ్వర్లు అట్లా వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేయనుంది. సెక్షన్ 356 బీఎన్ఎస్ను చేర్చుతూ దాఖలు చేసిన పిటిషన్పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ రచ్చ శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. పిటిషన్లో తెలిపిన వివరాల ప్రకారం మరికొన్ని సెక్షన్లు జోడిరచాల్సి ఉంటుందని.. వాటి ప్రకారం ఏ కోర్టును ఆశ్రయించాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి పిటిషన్లో పొందపర్చిన విధంగా సెక్షన్లను కూడా జోడిరచాల్సి ఉంటుందన్నారు. మరోవైపు నష్ట పరిహారాన్ని కోరుతూ మంత్రిపై మరో పిటిషన్ వేసేందుకు నాగార్జున తరఫు న్యాయవాది సిద్ధమవుతున్నారు.
……………………………………….