
* దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: లక్షలాది మంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీట్ (యూజీ) ఫలితాలు రానే వచ్చాయి. మే 4న నీట్ పరీక్ష జరిగింది. ఈ తెలుగు విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించారు. తెలంగాణ నుంచి 41,584 మంది విద్యార్థులు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి 36,776 మంది విద్యార్థులు నీట్ లో అర్హత సాధించారు. దేశ వ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో పాస్ అయిన వారికి దేశంలో ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. ఎంబీబీఎస్,బీడిఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశం పొందుతారు. మొత్తం బీద ఈ పరీక్షల్లో అబ్బాయిలదే పై చేయి ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన నీట్ యూజీ 2025 ఫలితాల్లో టాప్ 10 ర్యాంకులు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢల్లీి, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే దక్కించు కున్నారు. ఈ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఒక్క తెలుగు విద్యార్ధికి కూడా చోటు దక్కలేదు.
టాప్ 100లో ర్యాంకులు దక్కించుకున్న తెలుగు విద్యార్ధులు వీరే..
జీవన్ సాయి కుమార్, 18వ ర్యాంక్…షణ్ముఖ నిషికాంత్ అక్షింతల, 37వ ర్యాంక్..ఎం. వరుణ్, 46వ ర్యాంక్..వై. షణ్ముఖ్, 48వ ర్యాంక్..విదిశా మాజీ, 95వ ర్యాంక్..కార్తీక్ రామ్ కిరీటి, 19వ ర్యాంక్..కొడవటి మోహిత్ శ్రీరామ్, 56వ ర్యాంక్..దేశిన సూర్య చరణ్, 59వ ర్యాంక్..పి. అవినాశ్, 64వ ర్యాంక్..వై. సమీర్ కుమార్, 70వ ర్యాంక్..టి. శివమణి, 92వ ర్యాంక్..
………………………………