MLA Yashaswini Reddy Condolence Visit
ఆకేరు న్యూస్,రాయపర్తి : మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన గ్రామ మాజీ సర్పంచ్ ఎనగందుల మురళి సతీమణి (భార్య ) పుష్పలిలా అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, సోమవారం వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మురళి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హమ్యా నాయక్, గోవర్ధన్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
