
* ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి1న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ నేపథ్యంలోనే నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతోపాటు మొత్తం 16 బిల్లులను సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడిరచింది.
………………………………………….