
* కంట్రోల్ రూమ్కు బెదిరింపు కాల్ చేసిన ఓ మహిళ
* అప్రమత్తమైన పోలీసులు
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి హత్య చేస్తున్నట్లు ఓ మహిళ గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్ రూమ్కు బెదిరింపు ఫోన్ చేసింది. ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్కాల్ను ట్రేస్ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మహిళను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు మహిళ మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు భావిస్తున్నారు.
……………………………….