
* కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం
* ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం : ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రమాదాల సమయంలో రాజకీయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాదంపై ఆరాతీశారు. అగ్ని ప్రమాద ఘటన పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి అండగా ఉంటామని మాట ఇచ్చారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉదయం పూట 6:16 గంటలకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. సమాచారం రాగానే వెనువెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది వచ్చి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టి మంటలు ఆర్పేశారని వివరించారు. గుల్జారీ హౌస్లో నివసిస్తున్న వారిలో17 మంది కి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. వారందరినీ హాస్పిటల్ కి తరిలించామని తెలిపారు.ప్రస్తుతం వారందరికీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారని మంత్రి పొన్నం వివరించారు. అగ్ని ప్రమాదంలో చాలామంది మరణించారని సమాచారం ఉందన్న మంత్రి ప్రభుత్వం తరుపున అని రకాల చర్యలు చేపట్టామన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలతో మాట్లాడారని వివరించారు. వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి తనకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రమాదాన్ని తగ్గించారన్నారు. వారి కుటుంబాలను ఆడుకోవడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మరోవైపు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి (Dg Nagireddy) కూడా ఖండించారు. మా దగ్గర అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
…………………………………………..