
* తెలంగాణ రాష్ట్రం తరఫున వరంగల్ పోలీస్ కమిషనరేట్ డిప్యూటీ ఏ.ఓ ఎంపిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సైబర్ కమాండో శిక్షణకు తెలంగాణ రాష్ట్రం తరఫున వరంగల్ పోలీస్ కమిషనరేట్లో డిప్యూటీ ఏ.ఓగా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ కుమార్ ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ.. అదే స్థాయిలో సైబర్ నేరగాళ్ళు కూడా అదే స్థాయిలో ప్రజల సొమ్మును దోచేస్తున్నారు. ప్రస్తుతం సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకి రెట్టింపు అవుతుందడంతో ఈ సైబర్ నేరాలను నియంత్రించడానికి ప్రధానమంత్రి అదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో నూతనంగా సైబర్ కమాండోల విభాగం ఏర్పాటుకు ప్రణాళికను రూపోందించారు. ఇందుకోసం ఈ విభాగంలో సైబర్ కమాండోలుగా విధులు నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా వున్న పోలీస్, పారా మిలటరీ పోలీస్ విభాగంతో పాటు ఇతర భద్రత దళాల అనుబంధ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న నైపుణ్యం కలిగివున్న అధికారులను వివిధ రూపాల్లో పరీక్షలను నిర్వహించి తుదకు ఈ సైబర్ కమాండోలుగా ఎంపిక చేసుకొవడం జరిగింది. ఈ ఎంపికైన సైబర్ కమాండోలకు ఆరు నెలల కాలం తమిళనాడు తిరుచ్చిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో(ఐ.ఐ.టీ) వీరికి సైబర్ నేరాల నియంత్రణ, సైబర్ నేరస్థులను గుర్తించడం, దర్యాప్తు, న్యాయవిచారణ మొదలైన అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రతిష్టాత్మకమైనన ఈ శిక్షణకు తెలంగాణ రాష్ట్రం తరుపున వరంగల్ పోలీస్ కమిషనరేట్లో డిప్యూటీ ఏ.ఓగా విధులు నిర్వహిస్తున్న ఏ.ప్రశాంత్ కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ రaా ప్రశాంత్ కుమార్ అభినందిస్తూ, శిక్షణ తరగతుల ఎంపికకు సంబంధించిన ఉత్తర్వులను అందజేసారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నైపుణ్యం కలిగి వున్న ఉద్యోగులు తమ విధుల్లో మరింత రాణించేందుకు అధికారులు ప్రోత్సహించడంతో పాటు ప్రోత్సహకాలు కూడా వుంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.
………………………