
* జూన్ 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
* ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్
* భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆదేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ ఆలయం కల్యాణానికి ముస్తాబవుతోంది. జులై
1న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ జిల్లా
ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కల్యాణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
భక్తులు లక్షల సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు రాకూడదని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉచితంగా తాగునీరు అందించాలనిసూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకూడదని మంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కల్యాణంతో పాటు రథోత్సవ వేడుకను విజయవంతంగా పూర్తిచేయాలని మంత్రి అధికారులను కోరారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, కలెక్టర్ హరిచందన, డీసీపీ విజయ్కుమార్, కార్పొరేటర్ సరళ, ఆలయ చైర్మన్ సాయిబాబాగౌడ్, ఈవో రవీందర్గౌడ్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
……………………………………………….