![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-33.jpg)
* మాజీ మంత్రి హరీశ్రావు
ఆకేరున్యూస్, సిద్దిపేట: రైతుల కోసం ఎంతటి పోరాటాలు చేయటానికైనా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని హరీష్రావు ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతుల కోసం తాము నిరంతర పోరాటం కొనసాగిస్తామని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రిలో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషించారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ, కాలువ పక్కన ఆగి సెల్ఫీ దిగారు. రైతుల అవగాహన కోసం పంట వివరాలను ఆన్లైన్లో పొందుపరిచి, మార్కెట్ పరిస్థితుల గురించి ముందస్తు సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగునీరు అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం వల్లే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని చెప్పారు. నిత్యం నీటి కొరతతో తిప్పలు పడే ఈ ప్రాంతాలు సాగునీటి సౌకర్యంతో పచ్చగా మారాయని, ఇది కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందని హరీష్రావు గుర్తు చేశారు.
………………………………………