
ఆకేరున్యూస్, ఒడిశా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( Draupadi Murmu) ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తుండగా.. పూరీలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, ఒడిశా సీఎం మోహన్ చరణ్తో కలిసి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ముర్మును శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
……………………………..