
* రేపటి నుంచి కెనడా పర్యటన
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి కెనడాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జీ7 శిఖరాగ్ర సదస్సు (G7 summit) జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 15 నుంచి 17 వరకు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీకి కెనడా నుంచి గతవారం ఆహ్వానం అందించింది. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney).. మోదీకి ఫోన్ చేసి సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే, భారత్-కెనడా మధ్య నెలకొన్న విభేదాల కారణంగా జీ 7 సమ్మిట్కు ప్రధాని మోదీ దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ప్రధాని కెడనా పర్యటనలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశాయి. ఈ సదస్సు కోసం ప్రధాని రేపు ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్తారని తెలిపాయి. కాగా, జీ7 లో భారత్ సభ్యదేశం కాకపోయినా.. ఏటా ఈ సదస్సుకు భారత్కు ఆహ్వానం అందుతోంది.
……………………………….