
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
* పార్టీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా
* అధ్యక్షుడిగా రాంచందర్ రావు ఎంపికపై అభ్యంతరం
* నిజమైన నాయకులకు గుర్తింపు లేదని ఆవేదన
* సొంత పార్టీ నేతలే బీజేపీ కొంప ముంచుతున్నారని వ్యాఖ్య
* మీకు.. మీ పార్టీకో దండం అంటూ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ః గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి ఓ షాక్ ఇచ్చారు. బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు, పార్టీలో సొంత ఇమేజ్ కలిగిని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో తన ఆవేదన వెలిబుచ్చారు. పార్టీలో అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీలో పనిచేసే వారికి పార్టీ కోసం కష్ట పడే వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియాకమంపై ఆయన అభ్యంతరం వెలిబుచ్చారు. పార్టీ అధిష్టానం తమకు ఇష్టమైన వ్యక్తులను పార్టీ పై రుద్దడం సరియైంది కాదన్నారు. పార్టీలో బూత్ లెవల్ కార్యకర్త నుండి పార్టీలోని పెద్ద నాయకుల అభిప్రాయాన్ని గైరవించి కిందిస్థాయి నుంచి పై స్థాయి నాయకుల ఓటింగ్ పద్దతి ద్వారా పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.పార్టీ నేతలే పార్టీ అధికారంలోకి రావొద్దని కంకనం కట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.మీకు..మీ పార్టీకో దండం అంటూ ఆయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి రాజీనామా లేఖను పంపించారు.
—————————–