
* మోదీ, రేవంత్ రెడ్డిని ఢీకొట్టే సత్తా నాకే ఉంది
* కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరున్యూస్, వరంగల్ : ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఢీకొట్టే సత్తా నాకే ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి రాజ్యాన్ని పడగొట్టి.. బీసీ రాజ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్లో కేఏపాల్ విలేకరులతో మాట్లాడుతూ వరంగల్లో మీట్ ది ప్రెస్ పెట్టకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనను అడ్డుకున్నారని కేఏ పాల్ ఆరోపించారు. సదాశివపేటను అభివృద్ధి చేసినట్టు వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీని గెలిపించాలని 100 రోజుల్లో ఉచిత విద్య, వైద్యం అందిస్తానన్నారు. కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని.. రేవంత్ రెడ్డి వసూలు చేసిన ట్యాక్స్ డబ్బులతో ఢల్లీి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొన్నారన్నారు. రెడ్ల పార్టీల్లోని బీసీలు బయటకు రావాలని.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిని ఢీకొడుదామన్నారు. చిత్తశుద్ధి ఉన్న ఏ ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దన్నారు.
………………………………….