![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/ktr-ed_V_jpg-816x480-3g.webp)
* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రేవంత్ రెడ్డిపై ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయని చెప్పి.. తనపై కూడా ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేయించి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ కేసుల్లో వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేసేందుకు తాను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం.. రేవంత రెడ్డి సిద్ధమా..? అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఈడీ విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కేసు పెట్టారు. విచారణ సంస్థలను, అధికారులను గౌరవించి ఈ నెల 9న ఏసీబీ విచారణకు.. 16న ఈడీ విచారణకు హాజరయ్యానన్నారు. రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు ఏడు గంటల పాటు అడిగి అన్ని వివరాలు తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు.
…………………………….