* ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో వివాహం
* కోయంబత్తూర్ లోని ఈశా ఫౌండేషన్ లో సన్నిహితుల మధ్య ఒక్కటైన జంట
ఆకేరు న్యూస్, డెస్క్ : వార్తల్లో హాట్ టాపిక్ ఉండే సమంత మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కోయంబత్తూర్ లోని ఈశా ఫౌండేషన్లో సన్నిహితుల మధ్య వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు తెలిసింది.గత కొంతకాలంగా సమంత-రాజ్ నిడిమోరు జంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య రాజ్తో సమంత సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడం, ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్లో కలిసి హాజరవడం, ఆ తర్వాత ఒకే కారులో కలిసి కనిపించడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే అభిప్రాయం అందరిలో కలుగింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు కెరీర్పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అయితే గత కొంత కాలంగా రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఈ రోజు కోయంబత్తూరులోని ఈషా యోగ సెంటర్ లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం రాజ్ భార్య శ్యామలీ పెట్టిన ఓ పోస్ట్ . అందులో తెగించిన వ్యక్తులే అలాంటి పనులు చేస్తారు అని రాయడంతో రాజ్-సమంత పెళ్లి గురించే ఇలాంటి పోస్ట్ పెట్టిందని ముచ్చటించుకుంటున్నారు. అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగచైతన్యతో అక్టోబర్ 6 , 2017 వివాహం జరిగింది . కాగా అక్టోబర్ 2, 2021లో నాగచైతన్యతో విడాకులు జరిగాయి. సమంతతో విడిపోయిన తరువాత నాగ చైతన్య వర్ధమాన హీరోయిన్ శోభితా ధూళిపాలను ఆగస్టు 8, 2024 న వివాహం చేసుకున్నారు. కాగా సమంత మాత్రం తన కెరీర్ పైనే దృష్టి పెట్టింది.ప్రస్తుతం ఆమె “మా ఇంటి బంగారం” అనే చిత్రంతో పాటు, ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ను రాజ్ & డీకేలు తెరకెక్కిస్తుండగా, ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బీ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
………………………………….
