
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఈ నెల 23వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
………………………….