
* ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ
* పోలీస్ శిక్షణ కళాశాలలో యోగా వేడుకలు
ఆకేరు న్యూస్ మామునూరు ః యోగాతో మానసిక ఒత్తిడిని అధికమించవచ్చని పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ ఇంజారపు పూజ ఐపీఎస్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మూమునూరులోని పోలీస్ శిక్షణ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఇంజారపు పూజ ఐపీఎస్ మాట్లాడుతూ యోగా నిత్య జీవితంలో అంతర్భాగం కావాలని సూచించారు. యోగాతో మానసిక ప్రశాంతతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు.ఈ సందర్భంగా యోగా ట్రైనర్ రమణ ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. శిక్షణలో ఉన్న పోలీసులు యోగాలో పాల్గొని ఆసనాలు వేశారు.ఈ కార్యక్రమం లో, డి ఎస్పీ లు బిక్షపతి,వెంకటేశ్వర రావు,విజయ్,సోమాని, డాక్టర్,సుధీర్ ఆర్ ఐ,లు,చంద్రశేఖర్,నవీన్, కాశి రామ్,మహేష్,సి ఎల్ ఐ లు,సత్యనారాయణ,దీపక్, రామ్మూర్తి ఆర్ ఎస్ ఐ లు,దశరథ్,అనిల్,యుగంధర్,సుధాకర్,రాజేష్,అరుణ, ఏ ఎల్ ఐ లు,రాధిక,ప్రమీల, సి సి,సుమన్,రామాంజనేయ రెడ్డి,పి. ఆర్ ఓ,రామాచారి,ఫోటోగ్రాఫర్ తాహిర్ అలీ,సిబ్బంది,అధికారులు పాల్గొన్నారు.
………………………………………