
* స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
* తొలుత బాపూఘాట్ అభివృద్ది
* ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (TELANGANA CM REAVANTHREDDY)కీలక ప్రకటన చేశారు. నవంబరు ఒకటి(NOVEMBER 1)న మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు పడుతుందని, ఆ రోజు భూమి పూజ చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. మూసీ ప్రాజెక్టుపై( MUSI PROJECT) విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. తీవ్రస్థాయిలో కాంగ్రెస్ సర్కారుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా తొలి విడతలో బాపూఘాట్(BAPUGHAT) ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన గాంధీ విగ్రహాన్ని నెలకొల్పుతామని వివరించారు. గండిపేట నుంచి బాపూఘాట్ వరకు పనులు చేపడుతామన్నారు. కేబుల్ బ్రిడ్జి, బరాజ్ ఏర్పాటు చేస్తామన్నారు. మల్లన్న సాగర్ నుంచి రూ.7వేలకోట్లతో నీటిని ఉస్మాన్ సాగర్కు మళ్లిస్తామన్నారు. అక్కడి నుంచి హిమాయత్ సాగర్కు పంపుతామన్నారు. ట్రంక్లైన్ కోసం వచ్చే నెలలో టెండర్లు పిలుస్తారన్నారు. బాపూఘాట్ వద్ద ఎస్టీపీలతో నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదులుతామన్నారు. అలాగే కొత్తగా మరిన్ని ఎస్టీపీల నిర్మాణానికి మరో 15 రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నారు.
రిక్రియేషన్ సెంటర్లు.. రాత్రి వేళ మార్కెట్
మూసీ పునరుజ్జీవనంలో భాగంగా అద్భుతమైన ప్రణాళికలను రచించినట్లు రేవంత్ ప్రకటించారు. మూసీని మరొక సిటీగా అభివృద్ధి చేస్తానన్నారు. కన్సల్టెన్సీకి రూ.141కోట్లతో డీపీఆర్ తయారీకి ఒప్పందం కుదుర్చుకుంటామని పేర్కొన్నారు. మూడునెలల్లో నివేదిక వస్తుందన్నారు. మూసీని ఎకో ఫ్రెండ్లీ, వెజిటేరియన్ కాన్సెప్ట్తో అభివృద్ధి చేస్తామన్నారు.
మూసీ వెంట రిక్రియేషన్ సెంటర్లు, అంతర్జాతీయ వర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మూసీ వెంట రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు మార్కెట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ముందు నేను కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నానని.. తర్వాత ప్రజలను ఒప్పిస్తానన్నారు. మూసీపై అవగాహన కల్పిస్తూ వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానన్నారు. మూసి నిర్వాసితులను ఆదుకుంటామన్నారు.
………………………………………………………………………………….