
* చదువుతో పాటు సంస్కారం కలిగిఉండాలి
* మంత్రి సీతక్క
* బండారుపల్లి మోడల్ స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ ఆవిష్కరణ
ఆకేరు న్యూస్ ములుగు : విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు సంక్షేమ శాఖమంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి
మోడల్ స్కూల్ లో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి
చందర్ లతో కలసి కంప్యూటర్ ల్యాబ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత సంవత్సరం పలు కంపెనీల సహకారంతో జిల్లాలోని పలు పాఠశాలల్లో కంప్యూటర్లు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు నేటి ప్రపంచంతో పోటీ పడాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అని సీతక్క అన్నారు.గత ఏడాది పలు పాఠశాలల్లో కంప్యూటర్లను పంపిణీ చేసి కంప్యూటర్ విద్యను అందించామని గుర్తుచేశారు.గిరిజన ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కంప్యూటర్ పరిజ్ఞానంతో సిటీల్లో చదువుకునే పిల్లలకు ధీటుగా చదువుకోవాలని ఆమె పిల్లలను కోరారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ మంత్రి చొరవతో ఇన్ఫోసిస్ సంస్థ చే కంప్యూటర్లను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు విద్యలో ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండాలని, పదిమందికి సహాయం చేసేలా, మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు, ఇతరులు గౌరవించే విధంగా ఉండాలని అన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు నైతిక విలువలు పెంపొందించే విధంగా కృషి చేయాలని సూచించారు.అనంతరం విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవకి, మండల విద్యాధికారి తిరుపతి, జిల్లా సైన్స్ ఆఫీసర్ జయదేవ్, కో ఆర్డినేటర్ లు అర్షం రాజు, సాంబయ్య, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..