ఆకేరు న్యూస్, హనుమకొండ : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) నేడు నిర్వహించనున్న వేలాన్ని వాయిదా వేసింది. బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066/5లో గల 2.27 ఎకరాల భూమి అమ్మకానికి ‘కుడా’ ప్రకటన చేసింది. రూ. 100 కోట్ల విలువ చేసే భూమిని అధికార పార్టీ నేతలు దక్కించుకునేందుకు గంపగుత్తగా అమ్మకానికి పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో శుక్రవారం నిర్వహించే వేలం పాటను వాయిదా వేస్తూ కుడా వైస్ చైర్మన్ చాహత్ బాజ్పాయ్ ప్రకటించారు. తదుపరి వేలం పాటను ఎప్పుడు నిర్వహించే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అనివార్య కారణాలతో మాత్రమే వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు.
…………………………………………..
