
* భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
*ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాల పంపిణీ
ఆకేరు న్యుస్, ములుగు : పేదల కోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే
తెల్లం వెంకట్రావు అన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి ఎమ్మెల్యే పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను దశల వారీగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్నఅసత్య ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసమే నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
…………………………………………………….