
* పరిపాలన చేయడం చేతకాక ప్రతిపక్షంపై పగ..
* మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు
ఆకేరున్యూస్, మహబూబ్నగర్ : పరిపాలన చేయడం చేతకాక ఫ్రస్టేషన్లో తిట్ల పురాణం అందుకుంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డి (revanthreddy) పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (hareshrao) మండిపడ్డారు. ప్రతిపక్షంపై పగ పెంచుకుని, ప్రజలకు దగా చేస్తున్నాడన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి స్వామి (kurumurthy swamy) ని దర్శించుకున్న అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ దేవుడు, మసీదు, చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానని మాట తప్పి ఇష్టారీతిన పాలన సాగిస్తున్నాడని విమర్శించాడు. 10 ఏళ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళమని.. ఎన్ని తిట్లు అయినా మేము భరిస్తాం కానీ ప్రజలను మోసం చేస్తే మాత్రం ఊరుకోమని హరీశ్రావు హెచ్చరించారు.
…………………………………………….